సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎన్జీఓలు



PRC విషయమై ఆరా

సీఎం జగన్ గారు సానుకూలంగా స్పందించారని,సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ రావు

Amaravati: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన బుధవారం మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎన్జీవోలు కలిసారు.

ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు నేతృత్వంలో ఒక బృందం కలిసి తాడేపల్లి లో సీఎం జగన్ ను కలిసి పిఆర్సి విషయమై చర్చించారు. పీఆర్సీ నివేదిక ఇచ్చి చాలా రోజులు అవుతుంది అని, జోప్యం లేకుండా పిఆర్సి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తెలంగాణలో ఉద్యోగులకు పిఆర్సి ఇచ్చారని గుర్తు చేశారు.

ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి త్వరలోనే PRC ప్రకటిస్తామని, సీఎం చెప్పినట్లు ఎన్జీవో నాయకులు తెలిపారు. ముందు పిఆర్సి ఇస్తామన్నారు. తర్వాత DA లు ఇస్తామన్నారు. CPS రద్దు పై ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటానని చెప్పినట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు తో సంబంధం లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరినట్లు మీడియాతో బండి శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారని, ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.