సీఎం జగన్ సంచలన నిర్ణయం… కారుణ్య నియామకాలపై కీలక ఆదేశాలు

AP CM: YS జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కారుణ్య నియామకాలపై ఉన్నత స్థాయిలో సమీక్షించిన నిర్వహించిన సీఎం జగన్.

అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

కోవిడ్ బారినపడి మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలలోని ఒకరికి కారుణ్య నియామకాలు కింద ఉద్యోగం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ తక్షణమే మొదలు కావాలని… ఈ ప్రక్రియను నవంబర్ 30వ తేదీ నాటికి పూర్తిచేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు