ఎంపీటీసీలో వైసిపి దూకుడు…



ఏపీ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతోంది.

మొత్తం 9589 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైన కౌంటింగ్ లోని వైసీపీ దూకుడు పెడుతుంది. ఫలితాలను అధికార వైసీపీ కి అనుకూలం గా వస్తున్నాయి. ఇప్పటికే మొత్తం 2714 స్థానాలకు సంబంధించిన ఫలితాలను వెలువరించగా ఇందులో
వైసిపి 2506 చోట్ల విజయం సాధించింది. టీడీపీ 133 చోట్ల, జనసేన 7చోట్ల బీజేపీ 6 చోట్ల విజయం సాధించింది. ఇతరులు 62 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇదిలా ఉంటే మొత్తం 642 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఇప్పటి వరకు 132 స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. ఈ 132 స్థానాలను వైసీపీ కైవసం చేసుకున్నారు.