తిరుపతి లో అగరబత్తీల కేంద్రాన్ని ప్రారంభించిన వై.వి.సుబ్బారెడ్డి



తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో అగరబత్తీల కేంద్రం సోమవారం ప్రారంభమైంది. ఈ కేంద్రాన్ని అన్ని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, E.O జవహర్ రెడ్డి, AEO ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ… ఆలయాల్లో వాడిన పూలతో అగర్బత్తి ల తయారీ ని ప్రారంభించామని తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా దర్శన్ సంస్థ వీటిని తయారు చేస్తోందన్నారు. తిరుపతి, తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు.

ఏడు రకాల అగరబత్తీలను భక్తులకు అందుబాటులోకి తెచ్చాం. ఎలాంటి కెమికల్స్ లేకుండా పరిమళభరితంగా తయారు చేస్తున్నారు. వాడిన పూలు తో బొమ్మల తయారీ కూడా ప్రారంభించాం. సప్తగిరి మాసపత్రిక తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చారు. రంగుల పేజీలతో శ్రీవారి సమాచారాన్ని అందిస్తామని…TTD చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అన్నారు.

శ్రీవారి ఏడుకొండల కు సూచికగా ఏడు బ్రాండ్లతో అగరబత్తీలను టీటీడీ తయారు చేపట్టింది. అభయహస్త, తందనాన, దివ్య పాద,ఆకృష్టి, దృష్టి, తుష్టి, పేర్లతో అగరబత్తులు టిటిడి విడుదల చేసింది. తిరుమలలోని లడ్డు కౌంటర్ లో అగరబత్తీలను విక్రయానికి టిటిడి నిర్ణయించింది.



స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker