చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లో అవకతవకలు: గౌతమ్ రెడ్డి



విజయవాడ: చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్ కట్టబెట్టనున్నారు.

ఏడాది సస్పెన్షన్ ఉన్న.. రెండు నెలల్లోనే టెండర్ కట్ట పెట్టనున్నారు. టేరా సాఫ్ట్ కు టెండర్ కేటాయించేందుకు కాలపరిమితి పొడగించారు.

చంద్రబాబు, వేమూరి హరి కృష్ణ ప్రసాద్, కలిసి కుట్రకు పాల్పడ్డారని గౌతమ్ రెడ్డి మండిపడ్డారు. వేమూరి హరి కృష్ణ ప్రసాద్ ను టేరా సాఫ్ట్ లో రాజీనామా చేయించి ఫైబర్ నెట్ లో డైరెక్టర్ గా తీసుకున్నారు. టెండర్లలో అవకతవకలపై అభ్యంతరాలను కూడా పరిశీలించలేదని గౌతమ్ రెడ్డి ధ్వజమెత్తారు. 19 మందిపై సిఐడి అనుమానితులు గా కేసులు నమోదు చేసింది. దర్యాప్తు పూర్తయ్యాక మరింతమంది పాత్ర వెలుగు లోకి రావచ్చు అని గౌతమ్ రెడ్డి అన్నారు.