Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

TTD News: రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ

రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రోజుకు 2 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది. ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు అవకాశం కల్పించనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ వెల్లడించింది.

తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లోని కౌంటర్లలో ఈ టోకెన్లు ఇస్తామని తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 11 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ వర్గాలు నిలిపివేశాయి. కరోనా కేసులు తగ్గుతుండడంతో పునరుద్ధరించారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker