జబర్దస్త్ లో అనసూయ ప్లేస్ లో రాబోతున్న కొత్త యాంకర్

Sowmya Rao: తెలుగు టెలివిజన్ కు సంబంధించి బాగా ఫేమస్ అయిన ప్రోగ్రామ్స్లో, షోలలో జబర్దస్త్ కూడా ఒకటి. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ షో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ షో ద్వారా 8 ఏళ్లుగా బుల్లితెర ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. మొదట జబర్దస్త్ మాత్రమే నడిపిస్తూ ఉన్నప్పుడు దానికి ఎక్కువ రేటింగ్స్ రావడం వల్ల ఎక్స్ట్రా జబర్దస్త్ ని కూడా స్టార్ట్ చేశారు.

ఇదిలా ఉండగా మొదట జబర్దస్త్ షో కి యాంకర్ అనసూయ యాంకరింగ్ చేసేది. తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా పెట్టడం వల్ల జబర్దస్త్ కి యాంకర్ అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ యాంకరింగ్ చేస్తూ ఉండేవారు. ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా అందర్నీ బాగా ఎంటర్టైన్ చేస్తూ ఈ షో కూడా బాగానే ఫేమస్ అయ్యింది. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది.

గత కొంతకాలం నుంచి జబర్దస్త్ షో నుంచి ఎవరో ఒకరు బయటకు వెళ్తున్నారు. మళ్లీ రెమ్యూనరేషన్ ప్రాబ్లమో , తగిన రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వలన జబర్దస్త్ షో నుంచి వలసలు పెరిగాయి. తాజాగా యాంకర్ అనసూయ కూడా ఈ షో నుంచి వెళ్లిపోయారు. మరికొందరైతే ఆ షోఅలాగే అంటిపెట్టుకొని ఉన్నారు. ముందు జడ్జిగా ఉన్న నాగబాబు కూడా ఈ షోను వదిలి వెళ్లారు.

జబర్దస్త్ లో అనసూయ ప్లేస్ లో రాబోతున్న కొత్త యాంకర్ ఎవరు ?

తర్వాత కొంతమంది కమెడియన్స్ కూడా ఈ షోను వదిలి వెళ్లడం జరిగింది. మొన్నటికి మొన్న మంత్రి పదవి రావడం వల్ల ఇంతకుముందు జడ్జిగా ఉన్న రోజా కూడా ఈ షోను వదిలి వెళ్ళింది. మరికొందరు తమకు అన్నం పెట్టి, ఇంత క్రేజ్ ని అందించిన ఈ షోను వదిలి వెళ్ళేది లేదని మరికొందరు చెబుతున్నారు.

ఈ షో మొదలైనప్పటి నుంచి అనసూయ, రష్మీగౌతమ్ ఈ షోకు యాంకరింగ్ చేస్తూనే వాళ్ళు. వీరికి కుదరనప్పుడు మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ వర్షిని కూడా యాంకరింగ్ చేశారు. ఈ షో వల్ల అనసూయ కి ఎంత గొప్ప గుర్తింపు వచ్చిందో అందరికీ తెలిసిందే.

అనసూయ వెళ్ళిపోయాక ఈ షోను కొన్ని రోజులు రష్మీ చేతనే యాంకరింగ్ చేపించారు. రెండు చేయడానికి రష్మీకి కుదరక ప్రస్తుతం ఒక కొత్త యాంకర్ ని మల్లెమాల టీం పరిచయం చేస్తున్నారు.

ఇంతకీ జబర్దస్త్ కొత్త యాంకర్ ఎవరంటే సౌమ్యా రావు. కన్నడ, తమిళ్ సీరియల్స్ లో చేస్తున్న ఒక అమ్మాయిని యాంకర్ గా సెలెక్ట్ చేశారు. ఈమె ప్రస్తుతం తెలుగులో వస్తున్న శ్రీమంతుడు సీరియల్ లో కూడా నటిస్తుంది. ఈమె మొదటగా కన్నడ ఇండస్ట్రీ ద్వారా పరిచయం అయ్యారు.

ఈమె పట్టే దారి ప్రతిభ అనే జీ కన్నడ సీరియల్ ద్వారా మొదట పరిచయం అయ్యారు. ఈ సీరియల్లో ఆమెకు బాగా ఫేమ్ రావడం వల్ల తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా సీరియల్ నటించడానికి చాలా ఆఫర్స్ వచ్చాయి.

తమిళంలో సన్ టీవీలో వచ్చిన రోజా సీరియల్ లో సాక్షి పాత్రలో కూడా నటించారు. నెంజాం మరప్పతల్లై అనే తమిళ్ సీరియల్ లో నెగిటివ్ రోల్ లో కూడా మెప్పించింది. తెలుగు కు సంబంధించి ప్రస్తుతం ఈ టీవీ ఛానల్ లో వస్తున్న శ్రీమంతుడు సీరియల్ లో నటిస్తున్నారు.

ఈ మధ్యకాలంలోనే పండగ సందర్భంగా టీవీ యాక్ట్రెస్ లతో జబర్దస్త్ కమెడియన్స్ షోఒకటి చేశారు. ఈ షోలో సౌమ్యా రావు హైపర్ ఆది, ఆటో రాంప్రసాదులు వేస్తున్న పంచులకు రివర్స్ పంచులు వేస్తూ కనిపించింది సౌమ్యరావు.

ఈ టైంలోనే ఈమె అయితే ఈ షో కి యాంకర్ గా సరిపోతుంది అని మల్లెమాల టీం అనుకొని ఆమెను సంప్రదించి డీల్ కుదుర్చుకున్నారు. అనసూయ ప్లేస్ లో వస్తున్న ఈ కొత్త యాంకర్ ఈ షోను అనసూయ లేని లోటును తీర్చగలుగుతుందా? అన్న ప్రశ్న ఇప్పుడు అందరి జబర్దస్త్ ఫ్యాన్స్ లో ఉంది.

ఇది ఇలా ఉంటే ఇక యాంకర్ ఎవరైనా సరే వచ్చిన వెంటనే పులిహోర కలపాలని చూస్తూ ఉంటాడు హైపర్ ఆది. దీనికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు. ఈ కొత్త యాంకర్ రావడం వల్ల ఈ షో ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ఎంతవరకు ఈ షో రేటింగ్ పెంచగలుగుతుంది అనేది తెలియాల్సింది.