Pushpa 2: పుష్ప పార్ట్ 2 లో అతిధి పాత్రలో నటించిన మరో మెగా హీరో

Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన యాక్షన్ డ్రామా మూవీ అయినా పుష్ప పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీ డిసెంబర్ 17 ,2021 సంవత్సరంలో విడుదలైంది.

ఈ మూవీకి సంబంధించి సీక్వెల్ కూడా రెడీ చేస్తున్నారు. పార్ట్ వన్ 350.3 నుండి 373 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పార్ట్ 2 వస్తుందంటే అల్లు అర్జున్ అభిమానులకు పండగే పండగ. మరి ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించి కొన్ని వార్తలు కొంతకాలంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక మాస్ డైలాగ్ లీక్ అయినట్లు వార్తలు వస్తుంటే, తాజాగా ఈ మూవీలో మరో స్టార్ హీరో అతిథి పాత్రలో నటించనున్నాడని మరో వార్త వినిపిస్తుంది. ఈ మూవీలో కలెక్టర్ క్యారెక్టర్ లో మరో స్టార్ హీరో కనిపించబోతున్నట్లు సమాచారం.

పుష్ప పార్ట్ 2 లో అతిధి పాత్రలో నటించిన మరో మెగా హీరో

మరి ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. అయితే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుష్ప పార్ట్ 2 లో ఒక అతిధి పాత్రలో కలెక్టర్ క్యారెక్టర్లు కనిపించనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయం నిజమైతే మెగా అభిమానులకు పండగే పండుగ. ఇంతకుముందు రామ్ చరణ్, బన్నీ కలిసి “ఎవడు “అనే మూవీలో నటించారు.

అలాగే పుష్ప పార్ట్ 2 లో కేథరిన్ తెరెసా కూడా ఒక నెగిటివ్ పాత్రలో నటించనుందని సమాచారం. ఈ సినిమాలో మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా ఉంది అని దీనికి ఎవరైతే సరిపోతారు అని ఆలోచిస్తుంటే ఈ పాత్రలో మనోజ్ బా జ్ పాయ్ నటించబోతున్నట్లు తెలిసింది. ఒక స్టార్ హీరో ఇలాంటి పాత్రలో నటించాలంటే చాలా రిస్క్. కానీ చాలా ఈజీగా ఈ పాత్రను నటించాడు అల్లు అర్జున్.

ఇక ఈ మూవీలో రామ్ చరణ్ కూడా నటిస్తే ఇక మెగా ఫ్యామిలీ అభిమానులకు శుభవార్తే. ఈ మూవీ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటారు. మూవీలో పుష్పరాజు పాత్రలో బన్నీ నటన చాలా అద్భుతంగా ఉంది. ఈ మూవీలో రష్మిక మందన, సమంత చాలా బాగా నటించారు. అటు మెగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.