Sneha: భర్తతో విభేదాలు?

Sneha:ఇప్పుడు ఎక్కడ చూసినా విడాకుల ప్రస్తావనే వినిపిస్తుంది. మామూలుగా సామాన్య వ్యక్తులు విడాకులు తీసుకొని విడిపోతే, అది ఆ ఊరికి మాత్రమే తెలిసేది. అంతేకాకుండా దానిని పెద్దగా పట్టించుకునే వారు కూడా కాదు. ఇదే విడాకుల ప్రస్తావన సెలబ్రిటీస్ పరంగా వస్తే, పెద్ద హార్ట్ టాపిక్ గా మారుతుంది. సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారని తెలిసిన, తీసుకోబోతున్నారని తెలిసిన పెద్ద సంచలనాన్ని సృష్టిస్తుంది.

దీనికి ఎగ్జాంపుల్ గా నాగచైతన్య, సమంతను తీసుకోవచ్చు. ఎందువలన అంటే వీరిద్దరూ స్టార్ హీరో, హీరోయిన్స్. వీరు ప్రేమించుకొని, కొన్నేళ్లు సహజీవనం చేసి, ఆ తర్వాత భార్యాభర్తలు గా మారారు. అయితే 2021 అక్టోబర్ లో విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పటినుండి ఇప్పటివరకు వీరి విడాకులపై గాని, వీరుపై గాని ఏదో ఒక రకంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం సానియా మీర్జా, సోహెబ్ విడాకుల విషయం ఎంత వైరల్ అయిందో మనకు తెలిసిందే! ఇప్పుడు వీరి బాటలో స్నేహ- ప్రసన్న నడుస్తున్నారని తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు. స్నేహ హీరోయిన్ గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఆ తర్వాత పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి మంచి గుర్తింపును తెచ్చుకుంది. కోలీవుడ్ నటుడుతో వివాహమైన తర్వాత కూడా నటన చేస్తూ ఉంది. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి అనేక యాడ్స్లలో కూడా నటించారు.

Sneha, Prasanna Kumar

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది నటీనటునకు ఎవరు సాటి ఉండరు. ఒకప్పుడు శ్రీదేవి, మహానటి, సావిత్రి, సౌందర్య ఇలా చెప్పుకుంటూ పోతే, చాలానే ఉన్నారు. ఇలాంటి వారిలో స్నేహ ఒకరు. 2001లో వచ్చిన ప్రియమైన నీకు అనే సినిమా ద్వారా స్నేహ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది.

అయితే స్నేహ అనే పేరు నటన ప్రారంభించినప్పుడు వచ్చింది. తన పూర్తి పేరు సుహాసిని రాజారాం నాయుడు. బొంబాయిలో అక్టోబర్ 12 1981లో జన్మించింది.2000 ల సంవత్సరంలో మలయాళం లో వచ్చిన ఇంగనే ఓరు నీల పక్షి అనే సినిమా ద్వారా తన నటనను ప్రారంభించింది. స్నేహ తెలుగు లోనే కాక తమిళం, మలయాళం కన్నడ భాషలలో కూడా నటించింది.

2009లో అచ్చంఉండు అనే సినిమాలో ప్రసన్నకుమార్ తో కలిసి నటించిన, ఆ తర్వాత కూడా ప్రసన్న చేసే మోడలింగ్ షోలో, తనతో పాటుగా కనిపించింది. వీరి పరిచయం ప్రేమగా మారి మే 11 2012లో చెన్నైలో వివాహం చేసుకొని ఒకటయ్యారు. వీరు చెన్నైలో నివాసం ఉండేవారు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు.

తెలుగులో అనేక సినిమాలు చేసి విజయాన్ని అందుకుంది. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని ఏర్పరచుకుంది. అంతేకాకుండా కొన్ని టీవీ షోలకు కూడా జడ్జ్ గా పనిచేస్తుంది. పెళ్లి తర్వాత తెలుగులో సినిమాలు చేయకపోయినా, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో నటిస్తూనే ఉంది. ఇక టాలీవుడ్లో వినయ విధేయత రామ movie ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది.

పెళ్లి తర్వాత స్నేహ- ప్రసన్నను కోలీవుడ్ క్యూట్ కపుల్ గా పిలిచేవారు. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అంతేకాకుండా స్నేహ తన ఫ్యామిలీ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంతోషంగా ఉండేది. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో, ఏంటో తెలియదు కానీ, వీరు ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని, గొడవలు కారణంగా దూరంగా ఉంటున్నారనే వార్తలు, కోలీవుడ్లో వినిపిస్తున్నాయి.

స్నేహ తన భర్త మీద ఉన్న కోపం కారణంగా తన నుండి దూరంగా, సపరేట్గా వేరే ఇంట్లో ఉంటున్నారననే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. పిల్లలు కూడా తన దగ్గరే ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. దీంతో వీరు కూడా విడాకులు తీసుకోబోతున్నారు, అనే వార్త ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ వార్తపై స్నేహ ఏ విధంగా స్పందించలేదు. ప్రస్తుతానికి స్నేహ టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ చేస్తూ, టీవీ షోలకు న్యాయ నిర్మాతగా పనిచేస్తుంది. అందువలన తరచుగా హైదరాబాద్ కు వచ్చి వెళుతుంది. స్నేహ, ప్రసన్న విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త ఇప్పుడు తెగ హల్చల్ చేస్తుంది.

అయితే ఈ వార్తపై స్నేహ కానీ, తన భర్త ప్రసన్న కుమార్ గాని స్పందించలేదు. ఇది నిజమో, కాదో తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించేదాకా వెయిట్ చేయక తప్పదు.