శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దంపతులు

కర్నూలు / శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దంపతులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి గురువారం మధ్యాహ్నం దర్శించుకున్నారు.

పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా…అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సున్నిపెంట చేరుకున్నారు. సున్నిపెంట హెలిప్యాడ్ కు చేరుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఇంటెలిజెన్స్ ఐజీ శశిధర్ రెడ్డి, డిఐజి వెంకట్రామిరెడ్డి, జిల్లా ఎస్పి సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ద్వారా శ్రీశైలం చేరుకున్నారు..