andhra pradesh

APPSC నోటిఫికేషన్‌లకు వయోపరిమితి పెంపు

APPSC నోటిఫికేషన్‌లకు వయోపరిమితి పెంపు

APPSC ద్వారా వెలువడే నోటిఫికేషన్లకు గరిష్ట వయస్సు మరో సంవత్సరం పాటు అనగా 42 ఏళ్లుగా కొనసాగనుంది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 42 ఏళ్ళకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సెప్టెంబర్ 27వ తేదీనే దీనిపై జిఓ ఇవ్వగా తాజాగా గెజిట్ లో వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్ల కు పెంచుతున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ మేరకు వయోపరిమితి పెంచడం జరిగింది. ఈ పరిమితి కొంతకాలం లోపల విడుదలయ్యే నోటిఫికేషన్ల వరకే అని తెలిపారు. ఈ గడువు ఎప్పుడో ముగిసిపోయింది. దీంతో ఇప్పుడు మళ్లీ వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనికి కూడా కొంత గడువు విధించారు. 30/09/2022 వరకు ఏపీపీఎస్సీ విడుదల చేసే నోటిఫికేషన్ లకు మాత్రమే ఈ వయోపరిమితి మినహాయింపు వర్తిస్తుంది అని తెలియజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button