andhra pradeshTelangana

NTA నీట్ కటాఫ్ మార్కులు

460 మార్కులకు నీట్ కటాఫ్

అంచనాలు వేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు
ప్రాథమిక కీ విడుదల చేసిన ఎన్టీఏ
17 వరకు ఆన్లైన్లో అభ్యర్థుల ధ్రువీకరణ

వైద్యవిద్య యూజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి గత నెలలో జరిగిన నీట్ – 21 పరీక్ష ఓఎంఆర్ ఆధారిత ప్రాథమిక కీ శుక్రవారం విడుదలైంది. National Testing Agency నీట్ వెబ్సైట్లో కీ ని అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం విడుదల చేసిన ప్రాథమిక కీ పై అభ్యంతరాలను ఈ నెల 17వ తేదీ వరకు ఆన్లైన్లో స్వీకరిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. అనంతరం తుది కీ ని విడుదల చేస్తారు. అక్టోబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 22వ తేదీల మధ్య ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రాధమిక కీ లో ఫిజికల్ సైన్స్ కేటగిరిలో 1,2 మినహా మిగతా వాటికి సమాధానాలు దాదాపు సరిగ్గానే ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

కటాఫ్ మార్కులు తగ్గొచ్చు

MBBS ప్రవేశాలలో కటాఫ్ మార్కులు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. గతేడాది కన్వీనర్ కోటాలో సీట్లు దక్కించుకున్న చివరి అభ్యర్థి మార్కులు 493 కాగా, ఈసారి పేపర్ తీరుతో కటాఫ్ మార్కులు తగ్గొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా విడుదలైన ప్రాథమిక కీ ఆధారంగా ఇప్పటికే పలు కార్పొరేట్ విద్యాసంస్థలు మార్కులపై అంచనా వేశారు. ఈ సంవత్సరం 460 మార్కులు వచ్చిన వారికి కన్వీనర్ కోటాలో సీట్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button